బంగారం ధరలు పైపైకి.. స్వల్పంగా పెరిగిన వెండి ధరలు

Update: 2019-12-24 00:37 GMT

మూడు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయలు పెరిగింది. దీంతో 39,750 రూపాయల వద్దకు చేరుకుంది.  ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో   36,440 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి 10 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,860 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,750 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,440 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు పెరిగింది. దీంతో 38,400 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయల పెరుగుదల  నమోదు చేసి 37,200 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి పది రూపాయలు పెరిగింది.  దీంతో వెండి కేజీకి 46,860 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24.12.2019 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును. 

Tags:    

Similar News