పైకెగసిన బంగారం ధరలు.. వెండి ధరలూ పెరిగాయి!

కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా 10 గ్రాములకు 240 మేర పెరిగాయి. వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

Update: 2019-11-20 02:40 GMT

నాలుగు రోజులుగా తగ్గుతూ వెళ్తున్న బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. కాగా..వెండి ధరలు కూడా అదేబాటలో పైకి కదిలాయి. 20.11.2019 బుధవారం పది గ్రాముల బంగారం ధర మంగళవారం ధరలతో పోలిస్తే 240 రూపాయల వరకూ పెరిగింది. వెండి ధరలు కూడా కేజీకి 65 రూపాయల వరకూ పెరిగాయి.

బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,910 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 220 రూపాయలు పెరిగి 36,580 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 65 రూపాయలు పెరిగి  47,865 రూపాయలకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,910 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,580 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 250 రూపాయలు పెరిగి 38,550 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 37,350 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 65 రూపాయలు పెరిగింది. దీంతో 47,865 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20.11.2019 బుధవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News