Chandrababu Naidu: అమరావతికి రూ.15వేల కోట్లు.. చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధుల భేటీ

Chandrababu Naidu: ప్రపంచ బ్యాంకు సహకారంతో అమరావతికి.. రూ. 15 వేల కోట్లు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు

Update: 2024-08-20 16:45 GMT

Chandrababu Naidu: అమరావతికి రూ.15వేల కోట్లు.. చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధుల భేటీ

Chandrababu Naidu: ఏపీ రాజధాని అమరావతికి 15 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ రుణం సమకూర్చనుంది. రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈనెల 27 వరకు అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News