Pawan Kalyan: అమెరికా కాన్సుల్ జనరల్ లార్సన్‌తో పవన్ భేటీ

Pawan Kalyan: అమెరికా వెళ్లే యువతకు సహకరించాలని కోరిన పవన్

Update: 2024-07-30 16:09 GMT

Pawan Kalyan: అమెరికా కాన్సుల్ జనరల్ లార్సన్‌తో పవన్ భేటీ

Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్. పల్నాడు జిల్లాలో అటవీ శాఖ ఉద్యోగులపై దాడిని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో ఆయన మాట్లాడారు. వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించవద్దన్నారు. అనంతరం అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌‌తో ఆయన భేటీ అయ్యారు. లార్సన్‌ బృందాన్ని ఆయన సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Tags:    

Similar News