Y S Jagan: ఏపీలో రాక్షస పాలన సాగుతోంది

Y S Jagan: ఏపీలో ప్రభుత్వ పెద్దల అండగా దాడులు జరుగుతున్నాయి

Update: 2024-08-04 13:45 GMT

Y S Jagan: ఏపీలో రాక్షస పాలన సాగుతోంది

Y S Jagan: ఏపీలో రాక్షస పాలన సాగుతోందని మాజీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఏపీలో రాజకీయ హింస పెరిగిపోయిందని ఆరోపించారు. ఏపీలో ప్రభుత్వ పెద్దల అండగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఏపీలో కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. నంద్యాల, జగయ్యపేట ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎవరు ప్రశ్నించినా కేసులతో వేధిస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఎక్స్‌వేదికగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


Tags:    

Similar News