Ayesha Meera Murder Case: అయోషా మీరా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు

Ayesha Meera Murder Case: సత్యంబాబును నిర్దోషిగా తేల్చడంతో మరోసారి దర్యాప్తు

Update: 2023-05-04 08:15 GMT

Ayesha Meera Murder Case: అయోషా మీరా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు

Ayesha Meera Murder Case: అప్పట్లో సంచలనంగా మారిన ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం విచారణ చేపట్టాలంటూ తాజాగా సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయేషా మీరా హత్య కేసు సంచలనంగా మారింది. అయితే ఇదే కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగానే సీబీఐ మరోసారి ఈ కేసు విచారణ మొదలు పెట్టింది. ఇంతకు ముందే ఈ కేసులో అరెస్ట్ అయిన సత్యం బాబును కోర్టు గతంలో నిర్ధోషిగా ప్రకటించింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మరోసారి కోర్టును ఆశ్రయించి ఈ కేసులో ఏం జరిగిందో నిజ నిజాలు తేల్చాలంటూ వేడుకుంది.

Tags:    

Similar News