AP News: కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్

AP News: టీడీపీలో చేరిన ఐదుగురు కౌన్సిలర్లు, 15మంది ఎంటీసీలు

Update: 2024-07-31 10:46 GMT

AP News: కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ 

AP News: చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబుతోనే కుప్పం అభివృద్ధి సాధ్యమని వారన్నారు. త్వరలో మరికొంతమంది వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తెలిపారు. కుప్పంలో వైసీపీ అవినీతి, అరాచకాలపై విచారణ జరుగుతుందన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి చంద్రబాబు 250 కోట్లు కేటాయించారని తెలిపారు.

Tags:    

Similar News