AP News: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ సర్కార్ దృష్టి

AP News: బదిలీలపై కసరత్తు చేస్తున్న అధికారులు

Update: 2024-08-11 02:18 GMT

AP News: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏపీ సర్కార్ దృష్టి

AP News: ఏపీలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు జీవో జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోగా.. రెండు మూడు రోజుల్లో బదిలీపై ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. రేషనలైజేషన్‌ తెరమీదకు రావడంతో ట్రాన్స్‌ఫర్‌పై ఉత్కంఠ పెరిగింది. మరోవైపు జీరో సర్వీస్‌తో ఉద్యోగుల బదిలీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతి పత్రం ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News