AP News: రోజూ రావాల్సిందే.. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు ఏపీ డీజీపీ మెమోలు

AP News: మొత్తం 16 మంది అధికారులకు మెమోలు ఇచ్చిన డీజీపీ

Update: 2024-08-14 10:28 GMT

AP News: రోజూ రావాల్సిందే.. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు ఏపీ డీజీపీ మెమోలు

AP News: వెయిటింగులో ఉన్న ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ. పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా, అమ్మిరెడ్డి, విశాల్ గున్ని సహా... హెడ్ క్వార్టర్సులో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. మెమోలు అందుకున్న మొత్తం 16 మంది అధికారుల్లో ఇద్దరు డీజీ, ముగ్గురు ఐజీ స్థాయి అధికారులున్నారు. వీరంతా వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని ఆదేశాలిచ్చారు డీజీపీ.

Tags:    

Similar News