Ponguleti Srinivas: మొదటి సంవత్సరంలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తాం

Ponguleti Srinivas: 11వేల డిఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశాం

Update: 2024-03-10 11:03 GMT

Ponguleti Srinivas: మొదటి సంవత్సరంలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తాం

Ponguleti Srinivas: రేపు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మొదటి సంవత్సరంలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక 70రోజుల్లో 30వేల ఉద్యోగులు ఇచ్చామన్నారు. 11వేల డిఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశామని తెలిపారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు పొంగులేటి. కాకతీయ యూనివర్సిటీలో కె హబ్‌ను మంత్రులు పొంగులేటి, సురేఖ, సీతక్క ప్రారంభించారు. వర్సిటీలో పీవీ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించారు. హాస్టళ్లు, డైనింగ్ హాల్, క్యాంపస్ చుట్టూ కాంపౌండ్ వాల్, తదితర నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు.

Tags:    

Similar News