Revanth Reddy: అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయి
Revanth Reddy: లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy: హైదరాబాద్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో బిర్యానీకి, చాయ్, పాయ తాగడానికి వెళ్తే.. పోలీసులు కొడుతున్నారని.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రస్తావించగా.. స్పందించిన సీఎం ఇకపై అర్ధరాత్రి ఒంటిగంట వరకూ లిక్కర్ షాపులు తప్ప.. అన్ని దుకాణాలు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. అయితే.. లా అండ్ ఆర్డర్ విషయంలో తమ ప్రభుత్వానికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.