ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు-కారు ఢీ.. ముగ్గురు మృతి

Road Accident: ఆమన్‌గల్‌ మండలం అయ్యసాగర్‌ దగ్గర ఘటన

Update: 2024-05-24 04:21 GMT

ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు-కారు ఢీ.. ముగ్గురు మృతి 

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో బస్సు కారు ఢీకొనడంతో.. ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. కారు కల్వకుర్తి నుండి హైదరాబాద్ వస్తుండగా.. శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కున్న మృతదేహాలను జేసీబీ సహాయంతో వెలికితీశారు.

Tags:    

Similar News