Ponnala Lakshmaiah: రేవంత్‌ లాంటి వారు పార్టీలోకి వచ్చి కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు

Ponnala Lakshmaiah: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు.

Update: 2023-10-14 13:30 GMT

Ponnala Lakshmaiah: రేవంత్‌ లాంటి వారు పార్టీలోకి వచ్చి కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు

Ponnala Lakshmaiah: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రేవంత్‌ లాంటి వాళ్లు పార్టీలోకి వచ్చి కాంగ్రెస్‌ను బ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లను గౌరవించలేని దౌర్భాగ్య దుస్థితిలో కాంగ్రెస్‌ ఉందని ఆయన విమర్శించారు. రేవంత్‌ నాయకత్వంలో జీహెచ్‌ఎంసీ, ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో అవమానాలు భరించలేకే బయటికి వచ్చానని ఆయన అన్నారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించిన తర్వాత అన్ని విషయాలను వెల్లడిస్తానని పొన్నాలక్ష్మయ్య తెలిపారు.

Tags:    

Similar News