కొనసాగుతున్న మహబూబ్‌నగర్ MLC ఉప ఎన్నిక కౌంటింగ్‌

మహబూబ్‌నగర్‌ బాలుర జూనియర్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు

Update: 2024-06-02 05:01 GMT

కొనసాగుతున్న మహబూబ్‌నగర్ MLC ఉప ఎన్నిక కౌంటింగ్‌

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ MLC ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 1,437మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ కోసం అధికారులు 5 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరపున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. MLC కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. బైపోల్‌ను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News