Defamation Case: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

Defamation Case: సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.

Update: 2024-10-10 10:43 GMT

Defamation Case: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

Defamation Case: సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి..తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News