Kaleshwaram Project: కాళేశ్వరం అవకతవకలపై నేడు విచారణ

Kaleshwaram Project: ఇరిగేషన్ సెక్రటరీలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

Update: 2024-07-15 07:30 GMT

Kaleshwaram Project: కాళేశ్వరం అవకతవకలపై నేడు విచారణ

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకన్న లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, ఎస్కే జోషీ తో పాటు ఆర్దిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి రజత్ కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సభర్వాల్, ఆర్ధిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరో వైపు కమిషన్ ముందు విద్యుత్ రంగ నిపుణులు రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News