Hyderabad: మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసిన యువకులు.. గంజాయి అలవాటు చేసి మరీ గ్యాంగ్‌ రేప్‌

Hyderabad: సెల్‌ఫోన్ వాడటమే మైనర్ బాలికకు శాపంగా మారింది. ఫోన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు.

Update: 2024-06-25 07:20 GMT

Representational Image

Hyderabad: సెల్‌ఫోన్ వాడటమే మైనర్ బాలికకు శాపంగా మారింది. ఫోన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే గాక తన నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో వారి గుట్టు బయటపడింది.

మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ కాచిగూడలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన కుమార్తె 6వ తరగతి మధ్యలోనే ఆపేసి ఇంటిపట్టునే ఉంటుంది. నేరేడ్‌మెట్ వినాయకనగర్‌కు చెందిన విజయ్ కుమార్‌‌తో బాలికకు మొబైల్ ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. తన వాహనంపై ఆమెను ఎక్కించుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగేవాడు. 2023 ఆగస్టు నుంచి బాలికను విజయ్ కుమార్ పలుమార్లు నేరేడ్‌మెట్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం తన స్నేహితులైన బాలు, కృష్ణ, కిరణ్, అజయ్ లకు ఆబాలికను పరిచయం చేశాడు.

అప్పటివరకూ ఐదుగురు కలిసే గంజాయి సేవించేవారు. అయితే అప్పుడే పరిచయం అయిన బాలికకు గంజాయి అలవాటు చేశారు. అనంతరం గంజాయి మత్తులోకి జారుకున్న తర్వాత పలుమార్లు ఆమెపై ఐదుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన ఘోరాన్ని బాలిక తన తల్లి దగ్గర దాచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి నిలదీసింది దీంతో జరిగిన అఘాయిత్యాన్ని వెల్లడించింది. ఘటనపై నాలుగు రోజుల క్రితం కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ బాలికను భరోసా సెంటర్‌కు పంపించారు. భరోసా సెంటర్ నిర్వాహకురాలు మైనర్ బాలిక పరిస్థితిని చూసి కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. 

Tags:    

Similar News