Hyderabad: మియాపూర్ లో భారీగా బంగారం, వెండి సీజ్

Hyderabad: గుర్తింపు పత్రాలు లేకపోవడంతో నగలు సీజ్‌ చేసిన పోలీసులు

Update: 2023-10-16 09:21 GMT

Hyderabad: మియాపూర్ లో భారీగా బంగారం, వెండి సీజ్

Hyderabad: ఎన్నికల వేళ తెలంగాణలో భారీగా నగదుతో పాటు బంగారం, వెండి పట్టుబడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోట్ల విలువైన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌ మియాపూర్‌లో తనిఖీల్లో భాగంగా భారీగా బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా 27.540 కిలోల బంగారం 15కిలోల వెండి ఆభరణాలను ముగ్గురు వ్యక్తులు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బషీర్ బాగ్‌లోని ఓ నగల షాపు నుంచి బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు సదరు వ్యక్తులు చెబుతున్నారు.

Tags:    

Similar News