Telangana: నేడు గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష

Telangana: 10.30 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష

Update: 2024-06-09 05:21 GMT

 Telangana: నేడు గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష

Telangana: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి కాసేపట్లో.. ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది హాజరుకానున్న ప్రిలిమ్స్‌కు 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోనే 105 కేంద్రాలున్నాయి. ఉదయం 9గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పిన అధికారులు‌... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని సూచించింది. 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని TGPSC స్పష్టంచేసింది.

Tags:    

Similar News