Etela Rajender: కాంగ్రెస్ నేతలు మాయమాటలతో మోసం చేస్తున్నారు
Etela Rajender: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయడం సాధ్యం కాదు
Etela Rajender: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మాయమాటలతో మోసం చేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఆర్ఆర్ టాక్స్ పేరుతో తెలంగాణలో వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తోందని మోడీ, అమిత్ షానే అన్నారని చెప్పారు. తక్కువ టైమ్లో ప్రజల చేత చీత్కరింపబడిన ప్రభుత్వంగా రేవంత్రెడ్డి ప్రభుత్వానికి నిలిచిందన్నారు.