Revanth Reddy: కొందరికి ఇంకా ప్రజాస్వామ్యం గురించి తెలియడం లేదు
Revanth Reddy: యూత్ కాంగ్రెస్ లీడర్గా కేటీఆర్కు అవకాశమిచ్చిందే కాంగ్రెస్
Revanth Reddy: అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొందరికి ఇంకా ప్రజాస్వామ్యం గురించి తెలియడంలేదని ఎద్దేవా చేశారు. 51 శాతం ఓటింగ్ వచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అన్నారు. 49 శాతం ఓటింగ్ శాతం వచ్చిన వారు ప్రతపక్షంలో ఉంటారన్నారు. ప్రతిపక్ష నేతల తీరు వారి మర్యాదకే మంచిది కాదని సూచించారు. యూత్ కాంగ్రెస్ లీడర్గా కేటీఆర్కు అవకాశమిచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గతం గురించి మాట్లాడాలనే కోరిక ఉంటే తమకేం అభ్యంతరం లేదని తెలిపారు రేవంత్రెడ్డి.