KCR - Narendra Modi: మోడీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్...

KCR - Narendra Modi: ప్రధాని మోడీ డ్రామాలాడుతున్నారు...

Update: 2022-04-28 02:36 GMT

మోడీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్ 

KCR: టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడిపై నిప్పులు చెరిగారు. మోడి పాలన రాష్ట్రాలపై నిందలేస్తూ సాగుతోందన్నారు. ఈ దేశానికి మోడి ఏం చేశారని ప్రశ్నించారు. ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చెప్పాలని కోరారు. ఉద్వేగం, విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ప్రసంగాల జోరు... అబద్ధాల హోరు తప్ప ఏమి లేదన్నారు కేసీఆర్.

ప్రధాని మోడీ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. కరోనా గురించి సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి పెట్రోల్ గురించి ప్రస్తావించడం ఏంటని ప్రశ్నించారు. పన్నులు పెంచిన పాపాల భైరవులు కేంద్రంలోని పెద్దలేనని చెప్పారు. పెట్రోల్‌పై రాష్ట్రం ఒక్క పైసా పెంచలేదన్నారు. మనుషుల మధ్య తగాదాలు పెట్టేందుకు మతాన్ని వాడుతున్నారన్నారు కేసీఆర్. మోడీ మీ ఆటలు ఇక సాగవన్నారు కేసీఆర్.

రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందన్నారు కేసీఆర్. మన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉండాలని... శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండంగా మనమే తిరిగి గెలుస్తామన్నారు. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తాము నియమించుకున్న కన్సల్టెన్సీలు చెబుతున్న వివరాల ప్రకారం 90 సీట్లకు పైనే రావడం ఖాయమన్నారు కేసీఆర్. 

Tags:    

Similar News