BJP First List: తొలిజాబితాకు కసరత్తు.. ఫస్ట్‌లిస్ట్‌లో తెలంగాణ నుండి 8 పేర్లు ప్రకటించే అవకాశం

BJP First List: ఈనెల 29వ తేదీన మొదటి జాబితా విడుదలయ్యే ఛాన్స్‌

Update: 2024-02-25 13:00 GMT

BJP First List: తొలిజాబితాకు కసరత్తు.. ఫస్ట్‌లిస్ట్‌లో తెలంగాణ నుండి 8 పేర్లు ప్రకటించే అవకాశం

BJP First List: లోక్ సభ ఎంపీ అభ్యర్థులపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈనెల 29వ తేదీన మొదటి జాబితా విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఫస్ట్ లిస్ట్ లో తెలంగాణ నుండి 8 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి...కరీంనగర్ నుండి బండి సంజయ్... నిజామాబాద్ - ధర్మపురి అరవింద్... మల్కాజిగిరి - ఈటల రాజేందర్... భువనగిరి - బూర నర్సయ్య గౌడ్...చేవెళ్ల - కొండ విశ్వేశ్వర్ రెడ్డి... మెదక్ - రఘునందన్ రావు...మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ పేర్లను అధిష్టానం దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు...శాంతి కుమార్, జితేందర్ రెడ్డి పోటీలో ఉండడంతో..మహబూబ్ నగర్ నియోజకవర్గంపై అధిష్టానం దగ్గర తీవ్ర చర్చ జరిగినట్టు సమాచారం. చివరకు డీకే అరుణవైపు అధిష్టానం మొగ్గు చూపినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మల్కాజిగిరి నియోజకవర్గం నుండి కూడా వీరేందర్ గౌడ్, మురళీధర్ రావు, సురేష్ రెడ్డి, మల్క కొమరయ్య ,పన్నాల హరీష్ రెడ్డి పోటీలో ఉండడంతో జాతీయ నాయత్వం ఈ నియోజకవర్గం పై ప్రత్యేక కసరత్తు చేసింది. చివరకు ఈటల రాజేందర్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టినట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News