Nalgonda: పాల ట్యాంకర్ బోల్తా.. బకెట్లు, బిందెలతో పాలను తీసుకెళ్తున్న స్థానికులు..!
Nalgonda: మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ దగ్గర పాల ట్యాంకర్ బోల్తా పడింది. స్థానికులు బకెట్లు.. బిందెలతో పాలను తీసుకోవడానికి పరుగులు తీశారు.
Miryalaguda Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ దగ్గర పాల ట్యాంకర్ బోల్తా పడింది. మిర్యాలగూడ నుంచి నకిరేకల్ వెళ్తుండగా.. వేగం అదుపుతప్పి బోల్తాపడింది. కాగా.. పాల ట్యాంకర్ బొల్తా పడటంతో.. ట్యాంకర్ నుంచి పాలు లీక్ అవుతుండటంతో.. స్థానికులు బకెట్లు.. బిందెలతో పాలను తీసుకోవడానికి పరుగులు తీశారు.
ఏది దొరికితే అది పట్టుకుని ట్యాంకర్ నుంచి లీకైన పాలను సొంతం చేసుకున్నారు. కాసేపట్లోనే ట్యాంకర్ ఖాళీ అయింది. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పాల కోసం ఎగబడ్డ వారిని చెదరగొట్టారు.