రేణు దేశాయ్: ‘నా కూతురు కన్నీళ్ళు పెట్టుకుంది.. తల్లి శాపం మీకు తగులుతుంది’

‘నా కూతురు ఏడుస్తూనే ఉంది. మీకు ఈ తల్లి శాపం తగులుతుంది. మీకు కూడా ఓ కుటుంబం ఉంటుందని మర్చిపోవద్దు’ అంటూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఆవేదనతో చేసిన పోస్ట్ కలకలం సృష్టించింది.

Update: 2024-06-28 15:24 GMT

renu desai


‘నా కూతురు ఏడుస్తూనే ఉంది. మీకు ఈ తల్లి శాపం తగులుతుంది. మీకు కూడా ఓ కుటుంబం ఉంటుందని మర్చిపోవద్దు’ అంటూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఆవేదనతో చేసిన పోస్ట్ కలకలం సృష్టించింది.

అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే రేణు దేశాయ్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. తన పేరుతో ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను డిలిట్ చేశారు. ఇన్ స్టా గ్రామ్ ఖాతాను మాత్రం కొనసాగించనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ యాక్టివ్ గా ఉంటారు. కానీ, ఈసారి ఎదురైనట్రోల్స్‌కు ఆమె తీవ్రంగా బాధపడ్డారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసలు ఏం జరిగింది?

రేణు దేశాయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య. వీరిద్దరూ చాలా ఏళ్ళ కిందటే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అన్నా లెజినోవాను పవన్ కల్యాణ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పుణెలో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. పవన్, రేణు దేశాయ్‌ల కుమారుడు ఆకీరా నందన్ ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతతాడేపల్లికి వచ్చారు. జూన్ 12న పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

ఆ వేడుక తరువాత పవన్ తన భార్య అన్నా లెజినోవా, పిల్లలు ఆద్య, ఆకీరా నందన్ లతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఈ ఫోటోను ట్రోల్ చేశారు.‘రేణు దేశాయ్ ఈ ఫోటోను ఎలా క్రాప్ చేసుకుంటారు?’ అంటూ చేసిన ట్రోల్ మీద ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

‘ఈ ఫోటోను నేను ఏ విధంగా క్రాప్ చేస్తానని, ఎలా పోస్ట్ చేస్తానని మీమ్స్, జోక్ లు పేల్చిన భయంకరమైన వ్యక్తులారా... మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోవాలి’ అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. ‘నా కూతురు అది చూసి కన్నీళ్ళు పెట్టుకుంది. తల్లిని బాధ పెడుతుంటే నా కూతురు తట్టుకోలేకపోయింది. అలా ట్రోల్ చేసిన వారికి తల్లి శాపం తగులుతుంది’ అని తీవ్రంగా స్పందించారు.

ఈ రకమైన ట్రోల్స్‌తో లెజినోవా పిల్లలైన పోలెనా, మార్క్కూడా బాధపడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన కూతురు అనుభవించిన బాధ తెలపాలనే ఇలా పోస్ట్ పెడుతున్నానని ఆమె అన్నారు.

నా పిల్లల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

పవన్ కళ్యాణ్ తో ఆద్య, ఆకీరా ఆనందంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమయంలో కొందరు ట్రోల్స్ చేయడంపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పిల్లలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తప్పుబడుతున్నారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలని ఆమె సూచిస్తున్నారు.

పవన్ కళ్యాణే వదిలేశారన్న రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో రేణు దేశాయ్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆమె గట్టిగానే కౌంటరిచ్చారు. సోషల్ మీడియాలో ఒకరు ఆమెను పవన్‌తో విడాకులు తీసుకున్న ‘దురదృష్టవంతురాలు’అని కామెంట్ చేశారు.

సుధాకర్ అనే వ్యక్తి, ‘వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ, ఈ రోజు అయినా పవన్ కళ్యాణ్ విలువ మీకు తెలిసింది. పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం’ అంటూ కామెంట్ చేశారు.

ఈ ట్రోల్స్‌కు స్పందిస్తూ, తాను పవన్ కల్యాణ్‌ను వదిలేయలేదన్నారు. ఆయనే తనను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారని చెప్పారు. విడాకులు తీసుకోవడం దురదృష్టకరం కాదని, మనం 2024లో జీవిస్తున్నాం, మానసికంగా మనుషులు చాలా ఎదగాల్సి ఉందని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టి తనను టార్చర్ చేయవద్దని నెటిజన్లను కోరారు.

Tags:    

Similar News