Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Jammu Kashmir: ఉగ్ర దాడిలో ఆరుగురు పోలీసులకు గాయాలు

Update: 2024-06-26 17:00 GMT

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 11న దోడా జిల్లాలో చటర్‌ గల్లా వద్ద జాయింట్‌ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆ తర్వాతి రోజు గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల ఘటనలో ఓ పోలీసు గాయపడ్డారు. ఈ జంట దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్‌ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆర్మీ, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. గండోహ్‌ ప్రాంతంలోని బజాద్‌లో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని చెప్పారు.

Tags:    

Similar News