Mallikarjun Kharge: పదేళ్ల పాలనలో రైల్వేశాఖను దుర్వినియోగం చేశారు

Mallikarjun Kharge: మోడీ సర్కార్ వైఫల్యంతోనే రైలు ప్రమాదం

Update: 2024-06-17 16:09 GMT

Mallikarjun Kharge: పదేళ్ల పాలనలో రైల్వేశాఖను దుర్వినియోగం చేశారు

Mallikarjun Kharge: పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మోడీ సర్కార్‌ వైఫల్యమే కారణమని ఆరోపించింది. పదేళ్ల పాలనలో రైల్వేశాఖను బీజేపీ దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆ శాఖను ప్రచార వేదికగా మార్చేసిందని ఆరోపించారు. బాధితుల తరఫున పోరాడుతామన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దీనికి జవాబుదారిని చేస్తాం అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News