78వ స్వాతంత్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబు.. వేడుకలకు 6 వేల మంది ప్రత్యేక అతిథులు

ఎర్రకోటపై జెండా ఎగరేయనున్న ప్రధాని మోడీ

Update: 2024-08-14 16:30 GMT

78వ స్వాతంత్ర వేడుకలకు ఎర్రకోట ముస్తాబు.. వేడుకలకు 6 వేల మంది ప్రత్యేక అతిథులు 

Independence Day 2024: 78వ స్వాతంత్ర వేడుకల నిర్వహణకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వేడుకలకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. వివిధ రంగాల్లో రాణించిన, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో కొందరిని కేంద్రం ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఇటీవల పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాలకు కూడా ఆహ్వానం పంపింది. ఎర్రకోట వేదికగా జరగనున్న వేడుకలకు దాదాపు 400 మంది పంచాయతీరాజ్‌ సంస్థల మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు సంబంధిత మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News