International Yoga Day: నేడు కాశ్మీర్ కు ప్రధాని..దాల్ సరస్సు ఒడ్డున యోగా చేయనున్న మోదీ.!

International Yoga Day: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

Update: 2024-06-20 02:31 GMT

International Yoga Day 2024 : ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి 2 రోజులపాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ.. జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా శుక్రవారం (జూన్ 21) ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం. ఈసందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జమ్మూ కాశ్మీర్‌లో జరుపుకోనున్నారు. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డున ఆయన యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. యోగా దినోత్సవానికి ముందు ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు యువతతో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవలి కాలంలో కొన్ని ఉగ్రవాద ఘటనలు కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన దృష్ట్యా, మొత్తం శ్రీనగర్‌ను రెడ్ జోన్‌గా మార్చారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్, దాల్ సరస్సు చుట్టూ పక్షులు కూడా తిరగలేనంతగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా ప్రధాని తన పర్యటనలో జమ్మూ కాశ్మీర్‌కు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. అనంతరం జూన్ 21న ఉదయం 6:30 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. 2015 నుంచి ప్రతిఏటా యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు ప్రధాని నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూర్,న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంతో సహా పలు ప్రతిష్టాత్మక ప్రదేశాలలో యోగా దినోత్సవ వేడుకలకు ఆయన నాయకత్వం వహించారు. ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్ 'యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ', వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో దాని ద్వంద్వ పాత్రను హైలైట్ చేస్తుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని, యోగా వ్యాప్తిని ప్రోత్సహిస్తుందని పీఎంఓ తెలిపింది.

ప్రధాని పూర్తి షెడ్యూల్ ఇదే:

- జూన్ 20న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కెఐసిసి)లో 'యువతకు సాధికారత, జమ్మూ కాశ్మీర్‌ను మార్చడం' కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని పిఎంఓ తెలిపింది.

-ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి స్టాళ్ల‌ను ప‌రిశీలించి, జ‌మ్మూ కాశ్మీర్‌లోని 'యంగ్ అచీవర్స్'తో సంభాషించనున్నారు.

-ఈ సమయంలో ప్రధాన మంత్రి రూ.1,500 కోట్ల కు పైగా విలువైన 84 అభివృద్ధి పనులకు శంకుస్థాప న , ప్రారంభోత్సవాలు చేస్తారు.

-ప్రారంభమయ్యే ప్రాజెక్టులలో రోడ్డు మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా పథకాలు, ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.

-దీంతో పాటు చెనాని-పట్నీతోప్-నశ్రీ సెక్షన్ అభివృద్ధి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఆరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

-1,800 కోట్ల విలువైన వ్యవసాయం, అనుబంధ రంగాలలో పోటీతత్వ అభివృద్ధి (JKCIP) ప్రాజెక్ట్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు. జమ్మూ కాశ్మీర్‌లోని 20 జిల్లాల్లోని 90 బ్లాకుల్లో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుంది.

-ప్రభుత్వ సర్వీసులో నియమితులైన 2,000 మందికి పైగా నియామక పత్రాలను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేయనున్నారు.

-అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లో జరిగే ప్రధాన కార్యక్రమానికి ప్రధాని నాయకత్వం వహిస్తారు. 

Tags:    

Similar News