President Murmu: ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది

President Droupadi Murmu: 4వ రోజు పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.

Update: 2024-06-27 07:55 GMT

President Murmu: ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది

President Droupadi Murmu: 4వ రోజు పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా (లోక్‌సభ సభ్యులు) సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

10ఏళ్లుగా తమ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. ఐటీ నుంచి టూరిజం వరకు అన్నిరంగాల్లో భారత్‌ దూసుకుపోతోందని, ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోందన్నారు. సర్వీస్‌ సెక్టార్‌లను కూడా తమ ప్రభుత్వం బలపరుస్తోందన్నారు రాష్ట్రపతి ముర్ము. 

Tags:    

Similar News