Narendra Modi: బీజేపీ ఆవిర్భావోత్సవంలో ప్రధాని మోడీ కీలకోపన్యాపం...

Narendra Modi: ప్రజల ఆశీర్వాదంతో పార్లమెంటులో బీజేపీ సంఖ్యాబలం పెరిగింది...

Update: 2022-04-06 07:34 GMT

Narendra Modi: బీజేపీ ఆవిర్భావోత్సవంలో ప్రధాని మోడీ కీలకోపన్యాపం...

Narendra Modi: కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి మానవీయ సాయం అందివ్వాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావదినోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ప్రజల్లో విశ్వసనీయత పెంపొందించేందుకు పార్టీ శ్రేణుల కృషిని ఆయన అభినందించారు.

లోక్ సభలో ఇద్దరు సభ్యులతో ప్రారంభమైన ప్రస్థానం... దశలవారీగా మెజారిటీ సభ్యుల సంఖ్య పెరిగిందని, రాజ్యసభలోనూ వందమందికి చేరుకోవడం వెనుక ప్రజాశీర్వాదం ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎక్కడా ఓటుబ్యాంకు రాజకీయాలతోగాకుండా... ప్రజాఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు పార్టీశ్రేణులు సహకరించాలని కోరారు.

Tags:    

Similar News