Rahul Gandhi: సంకీర్ణ ప్రభుత్వ మనుగడ కోసం మోడీ కష్ట పడుతున్నారు
Rahul Gandhi: మోడీ శిబిరంలోని ఎంపీలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉంది
Rahul Gandhi: సంకీర్ణ ప్రభుత్వ మనుగడ కోసం ప్రధాని మోడీ కష్టాలు పడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ శిబిరంలోని ఎంపీలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్నారు. 400 సీట్లు గెలుస్తామన్న ఎన్డీయే... 293 సీట్లతో అధికారంలోకి వచ్చిందని... అయినా ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. ఇండియా బ్లాక్ అంచనాలకు మించి 234 స్థానాలను కైవసం చేసుకుందని తెలిపారు. బీజేపీ కంచుకోటైన యూపీలో ఇండియా బ్లాక్ బలమైన శక్తిగా నిలిచిందన్నారు.