Amit Shah: వరద నిర్వహణ, సన్నద్ధతపై ఉన్నత స్థాయి భేటీ

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమీక్ష

Update: 2024-06-23 13:30 GMT

Amit Shah: వరద నిర్వహణ, సన్నద్ధతపై ఉన్నత స్థాయి భేటీ

Amit Shah: దేశంలో వరద నిర్వహణ, సన్నద్ధతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నార్త్ బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం సహా కొన్ని రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపోయాయి. అసోంలోని 19 జిల్లాల్లో 3 లక్షల మంది ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 35 గ్రామాలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని అమిత్ షా ఏర్పాటు చేశారు. సమావేశంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సహా సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Tags:    

Similar News