భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగులు

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను అమర్చారు.

Update: 2024-09-10 04:44 GMT

భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగులు

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను అమర్చారు. వేగంగా వచ్చిన ఓ రైలు ఆ సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్‌తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు, అధికారులకు కావాలనే ఎవరో కుట్ర చేశారని అనుమానిస్తున్నారు.

ఈ కుట్రలో ఒకరి కంటే ఎక్కుమంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు. గత రెండ్రోజుల క్రితం కాన్పూర్‌లో ఇదే తరహా కుట్ర జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News