J&K Assembly Elections: జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత ఎన్నికలు..నేడు తొలి విడత పోలింగ్ ప్రారంభం

Jammu Kashmir Assembly Elections 2024: జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ నేడు షురూ అయ్యింది. 10ఏండ్ల తర్వాత జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో తీవ్ర్ ఉత్కంఠ నెలకొంది. జమ్ము కాశ్మీర్‌లోని 7 జిల్లాల్లోని మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవిత్యం తేలనుంది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇది.

Update: 2024-09-18 03:06 GMT

Jammu Kashmir Assembly Elections 2024: జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ నేడు షురూ అయ్యింది. 10ఏండ్ల తర్వాత జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో తీవ్ర్ ఉత్కంఠ నెలకొంది. జమ్ము కాశ్మీర్‌లోని 7 జిల్లాల్లోని మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవిత్యం తేలనుంది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇది.

గత పదేండ్ల తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి దశ కింద మొత్తం 7 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది. జమ్మూ ప్రాంతంలోని 3 జిల్లాలు, కాశ్మీర్ లోయలోని 4 జిల్లాల్లోని 24 స్థానాల్లో 90 మంది స్వతంత్ర అభ్యర్థులతో సహా మొత్తం 219 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.

ఈరోజు ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పోరా, జైనపోరా, షోపియాన్, డీహెచ్ పోరా, కుల్గాం, డియోసర్, డోరు, కోకెర్‌నాగ్ (ఎస్టీ), అనంత్‌నాగ్ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా, షాంగాస్-అనంతనాగ్ ఈస్ట్, పహల్గాం ఉన్నాయి. ఇందర్వాల్, కిష్త్వార్, పాడేర్-నాగసేని, భదర్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్ , బనిహాల్ ప్రాంతాలు ఉన్నాయి.

కాగా జమ్మూకశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. తొలి విడతలో భాగంగా 24 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరుగుతుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 23లక్షల మంది ఓటర్లు ఈ విడతలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో స్థానిక బలాలతోపాటు చారిత్రక నేపథ్యం, పార్టీ అనుబంధ ప్రాంతాలు మరింత కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు.

అయితే బీజేపీ అధికారం తమదే దక్కుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. మరాజ్ రీజియన్ లోని అనంత్ నాగ్, పుల్వామా, కుల్గాం, తోపాటు పలు ప్రాంతాలో పోలింగ్ జరిగే వాటిలో ఉణ్నాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. ఎన్సీతో కాంగ్రెస్ పొత్తుతో పోటీలోకి దిగింది.

Tags:    

Similar News