Ram Charan: క్రేజీ కాంబినేషన్.. ఆ స్టార్ డైరెక్టర్తో చేతులు కలపనున్న చెర్రీ?
Ram Charan: ఆర్ఆర్ఆర్ విజయంతో నేషనల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
Ram Charan: ఆర్ఆర్ఆర్ విజయంతో నేషనల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా పూర్తికాగానే బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వంలో కూడా చెర్రీ ఓ సినిమాలో నటించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. దిగ్గజ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ వంటి విజయాలంతో నేషనల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. వీటితో పాటు సలార్2, కేజీఎఫ్3 కూడా లైన్లో ఉన్నాయి. అయితే రామ్చరణ్ సినిమా.. ఈ మూడు సినిమాలు పూర్తయ్యాకే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈలోపు రామ్చరణ్.. బుచ్చిబాబు, సుకుమార్ల సినిమాలు పూర్తి చేయనున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20 లేదా 25వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. దీపావళి కానుకగా ఈ నెల 30వ తేదీన ఓ పాట విడుదల చేయనున్నారు.