నాగచైతన్య-శోభిత పెళ్లిపనులు ప్రారంభం

Update: 2024-10-21 09:30 GMT

 నాగచైతన్య-శోభిత పెళ్లిపనులు ప్రారంభం

నాగచైతన్య- శోభిత పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల ఫోటోను శోభిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయంటూ ఆమె సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తన తల్లితో పాటు అత్యంత సమీప బంధువుల సమక్షంలో ఈ  వేడుకలు జరుగుతున్నాయి. ఎరుపురంగు చీర ధరించి పెళ్లికి ముందుకు జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్లి ఎక్కడ జరుగుతోందో చెప్పాలని కొందరు నెటిజన్లు ఆమెను కోరుతున్నారు.ఎంగేజ్ మెంట తర్వాత ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభిత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా నాగచైతన్య శోభితతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.తెలుగు సంప్రదాయం ప్రకారంగా పెళ్లి వేడుకలో పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పెళ్లి వేడుక ప్రారంభానికి సూచికగా దీన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ హైద్రాబాద్ లో జరిగింది.

వీరిద్దరూ చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ . 2016లో సినీ ఫీల్డ్ లోకి వచ్చారు.నాగచైతన్య గతంలో సమంతను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు.

Tags:    

Similar News