కోర్టుకు నాగార్జున.. ఉత్కంఠగా మారిన నాంపల్లి కోర్టు నిర్ణయం

Defamation Case: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‎పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది.

Update: 2024-10-08 05:25 GMT

కోర్టుకు నాగార్జున.. ఉత్కంఠగా మారిన నాంపల్లి కోర్టు నిర్ణయం

Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‎పై నాంపల్లి  కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ట దెబ్బతినేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌ను పరిశీలించి, వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ పిటిషనర్ నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని పేర్కొంది. దీంతో నాంపల్లి కోర్టు‎కు హీరో నాగార్జున మంగళవారం హాజరు కానున్నారు.

ఇదే సమయంలో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు.  తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సురేఖకు లీగల్ నోటీసులు పంపగా.. తాజాగా హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

బీఆర్‌ఎస్ మహిళా నేతలు సురేఖ వ్యాఖ్యలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోని ప్రధాన తార‌లంతా మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం సినీపరిశ్రమలోని వ్యక్తులను టార్గెట్ చేయడం సరి కాదని పలువురు సినీ రంగ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావిస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున, సమంతతోపాటు సినీ రంగ ప్రముఖులంతా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. మరోవైపు కేటీఆర్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు.

హీరో నాగార్జున కుటుంబం పేరును ప్రస్తావించినందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ ప్రకటించినప్పటికీ.. ఆమె వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన పరువుకు భంగం కలిగిందంటూ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో... ఈ పిటిషన్‌పై కోర్టులో నిన్న విచారణ జరిగింది. హీరో నాగార్జున, ఈ ఫిర్యాదులో సాక్షులు ఇచ్చే స్టేట్‌మెంట్ ఎలా ఉండబోతోంది..? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..? ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News