Game Changer: చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. గేమ్‌ ఛేంజర్‌ వచ్చేది అప్పుడే..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల ఎప్పుడనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Update: 2024-08-26 12:37 GMT

Game Changer: చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. గేమ్‌ ఛేంజర్‌ వచ్చేది అప్పుడే..

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్‌. భారతీయుడు 2 డిజాస్టర్‌ తర్వాత గేమ్‌ ఛేంజర్‌పై మరింత దృష్టిసారించిన శంకర్‌.. ఏ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను తెరకెకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమైనా ఇప్పటికీ టీజర్‌, ట్రైలర్‌ లాంటి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్‌ ఆందోళనలో ఉన్నారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వేయి కళ్లతో చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల ఎప్పుడనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఓ వార్త సినిమా సర్కిల్స్‌లో తెగ వైరల్‌ అవుతోంది. గేమ్‌ ఛేంజర్‌ వాయిదా పడుతుందని వాస్తున్న వార్తల నేపథ్యంలో ఈ కొత్త న్యూస్‌ చెర్రీ ఫ్యాన్స్‌కు ఊరటనిస్తోంది. తాజా సమాచారం ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌ కారణంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీపై ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని అంటున్నారు.

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే గేమ్‌ ఛేంజర్‌లో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ వంటి భారీ స్టార్స్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తుండగా.. పాపులర్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

Tags:    

Similar News