Nepal Bus Accident: నేపాల్లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన భారత ప్రయాణికుల బస్సు
Nepal Bus Accident: ఈ ప్రమాదంలో 11 మంది మరణించారని అధికారులు గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఏడాది త్రిశూలి నదిలో బస్సు బోల్తా పడిన ఘటనలో 65 మంది గల్లంతయ్యారు.
Nepal Bus Accident: నేపాల్ తనహున్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి మరయంగ్డి నదిలో ఓ టూరిస్ట్ బస్సు పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారని అధికారులు గుర్తించారు. వీళ్లంతా యూపీకి చెందినవారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. బస్సు కూడా యూపీకి చెందినదిగా గుర్తించారు. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఈ ప్రమాదంలో తమ రాష్ట్రానికి చెందినవారున్నారా అనే విషయమై ఆరా తీస్తున్నామని ఉత్తర్ ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ చెప్పారు.
ఈ ప్రమాదంలో 11 మంది మరణించారని అధికారులు గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఏడాది త్రిశూలి నదిలో బస్సు బోల్తా పడిన ఘటనలో 65 మంది గల్లంతయ్యారు.