APPSC: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..!

APPSC: ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది.

Update: 2023-03-28 10:47 GMT

APPSC: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..!

APPSC: ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది APPSC. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ -1 మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను UPSC సోమవారమే విడుదల చేసింది. UPSC సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ -1 అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్‌-1 మెయిన్స్‌ని జూన్‌లో నిర్వహించాలని APPSC నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకుని మెయిన్స్ వాయిదా వేసింది APPSC.

Tags:    

Similar News