Credit Cards: ఏప్రిల్ 1 నుంచి మారనున్న క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఇక ఆ బెనిఫిట్స్ అన్నీ కట్..!

Credit Cards: ఎస్‌బీఐ కార్డ్ తన రివార్డ్ పాయింట్స్ ప్రోగ్రామ్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇవి వచ్చే నెల 1, 2025 నుండి అమల్లోకి రాబోతున్నాయి.

Update: 2025-03-27 11:00 GMT
Credit Card: క్రెడిట్ కార్డు కొత్త రూల్స్..ఏప్రిల్  1 నుంచి SBI, HDFC సహా బ్యాంకుల్లో మార్పులు

Credit Card: క్రెడిట్ కార్డు కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి SBI, HDFC సహా బ్యాంకుల్లో మార్పులు

  • whatsapp icon

Credit Cards: ఎస్‌బీఐ కార్డ్ తన రివార్డ్ పాయింట్స్ ప్రోగ్రామ్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇవి వచ్చే నెల 1, 2025 నుండి అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా కొన్ని ఆన్‌లైన్ లావాదేవీలు, ట్రావెల్ సంబంధిత కొనుగోళ్లపై రివార్డ్ పాయింట్స్ తగ్గుతాయి. ఈ మార్పులు సింప్లీ క్లిక్ ఎస్‌బీఐ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు వర్తిస్తాయి.

స్విగ్గీ ఖర్చుపై తక్కువ రివార్డ్ పాయింట్లు

ఏప్రిల్ 1, 2025 నుండి సింప్లీ క్లిక్ ఎస్‌బీఐ కార్డ్‌పై స్విగ్గీలో చేసిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు తగ్గుతాయి. ఇంతకుముందు, కార్డ్ హోల్డర్లు స్విగ్గీలో ఖర్చు చేసినందుకు 10X రివార్డ్ పాయింట్లు పొందేవారు. కానీ ఇప్పుడు అది 5Xకి తగ్గించారు. అయితే, ఈ కార్డ్‌లోని కొన్ని ఇతర ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లైన అపోలో 24X7, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, డొమినోస్, ఐజీపీ, మింత్రా, నెట్‌మెడ్స్, యాత్రపై 10X రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.

రివార్డ్ పాయింట్లలో కోత

ఎస్‌బీఐ కార్డ్ ఎయిర్ ఇండియా టిక్కెట్ కొనుగోలుపై రివార్డ్ పాయింట్లలో కూడా అనేక మార్పులు చేసింది. మార్చి 31, 2025 నుండి ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసినప్పుడు ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్‌లపై రివార్డ్ పాయింట్లు తగ్గుతాయి.

ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్

ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ప్రాథమిక కార్డ్ హోల్డర్ ఇప్పుడు ఒక్కో రూ. 100కి 5 రివార్డ్ పాయింట్లు మాత్రమే పొందుతారు. ఇది ఇంతకుముందు 15గా ఉండేది. ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ప్రాథమిక కార్డ్ హోల్డర్లు ఇప్పుడు రూ. 100కి 10 రివార్డ్ పాయింట్లు మాత్రమే పొందుతారు, ఇంతకుముందు ఇది 30 పాయింట్లుగా ఉండేది.

కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీ రద్దు

దీంతోపాటు, ఎస్‌బీఐ కార్డ్ తన కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీని కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. జూలై 26, 2025 నుంచి కార్డ్ హోల్డర్‌లకు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ రూ. 50 లక్షలు, రైలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ రూ. 10 లక్షలను నిలిపివేసింది.

Tags:    

Similar News