జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య

రేపు పవన్‌ సమక్షంలో జనసేనలో చేరనున్న కిలారి

Update: 2024-09-21 10:17 GMT

జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య

గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సమక్షంలో కిలారి రోశయ్య రేపు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన గ్లాస్ పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా, పొన్నూరు ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు కిలారి రోశయ్య.

Tags:    

Similar News