శాసనసభ రద్దు చేయండంటూ చంద్రబాబు పిచ్చి సవాళ్లు చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎన్నికల కోసం చంద్రబాబుకి అంత కంగారుగా ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని సూచించారు.
టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాచేసి ఉపఎన్నికలకు వెళ్తే ఈసారి రెండు సీట్లు కూడా రావంటూ అంబటి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనే ఆలోచనే తమకుంటే టీడీపీలో చంద్రబాబు ఒక్కరు మాత్రమే మిగిలేవారని అన్నారు. లోకేష్ కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.