Varahi Yatra: రేపటి నుంచి వారాహి యాత్ర.. పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ..!

Varahi Yatra: టీడీపీ-జనసేన పొత్తుతో వారా‍హియాత్రపై పెరిగిన అంచనాలు

Update: 2023-09-30 05:59 GMT

Varahi Yatra: రేపటి నుంచి వారాహి యాత్ర.. పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ..!

Varahi Yatra: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మరోసారి వారా‍హియాత్ర ద్వారా ప్రజలతో మమేకం కానున్నారు. ఇప్పటికే మూడు దశల్లో వారా‍హియాత్రను పవన్‌ నిర్వహించారు. ఇక.. రేపటి నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలో 4వ విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

టీడీపీ-జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో.. ఈసారి వారాహియాత్రపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నాలుగో విడత వారాహియాత్ర 5 రోజుల పాటు జరగనుంది. ఇక.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వారాహియాత్ర సాగనుంది. అవనిగడ్డ సభ అనంతరం.. జనసేనాని మచిలీపట్నం చేరుకుంటారు. 2, 3 తేదీల్లో అక్కడే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో పవన్‌ సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు.

Tags:    

Similar News