మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం దేవస్థానం సిద్ధం
* భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారుల చర్యలు
Srisailam: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల దేవస్థానం సిద్ధమైంది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాల కల్పనే ధ్యేయంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈసారి శివదీక్షా పరులు వారి స్వస్థలాలలోనే మాల విరమణ చేయాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.