శ్రీశైలంలో వ్యక్తి దారుణ హత్య

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు కలిసి హత్య

Update: 2024-09-22 07:45 GMT

శ్రీశైలంలో వ్యక్తి దారుణ హత్య

శ్రీశైలంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. క్షేత్రంలోని పాతాళగంగ పాత మెట్ల మార్గంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గాజు సీసాతో మరో వ్యక్తి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. అర్ధరాత్రి ఘటన జరగడంతో పక్కనే ఉన్న చెత్త పేపర్లు సేకరించే వ్యక్తులు చూసి స్థానిక పోలీసులకు సమచారం చేరవేశారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి హుటాహుటిన 108 లో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ మృతిచెందాడు.

అయితే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా క్షేత్రంలో వచ్చే భక్తులకు బొట్లు పెడుతూ వారు ఇచ్చే పది పరకాతో జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రి మద్యం మత్తులో ఉండగా వీరి మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి అశోక్ అనే వ్యక్తిని హత్య చేసినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. హత్య చేసిన ఇద్దరి వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News