తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులే లక్ష్యం

వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి తో ఆరోగ్యకరమైన అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులను సన్నద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవ సాయ శాఖ సహాయ సంచాలకులు జయప్రద అన్నారు.

Update: 2019-12-11 07:44 GMT
వ్యవ సాయ శాఖ సహాయ సంచాలకులు జయప్రద

ఉయ్యూరు : వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి తో ఆరోగ్యకరమైన అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులను సన్నద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవ సాయ శాఖ సహాయ సంచాలకులు జయప్రద అన్నారు. నిర్వహించిన వైఎస్సార్ పొలంబడి కార్యక్రమంలో భాగంగా రైతులతో క్షేత్రస్థాయిలో ఆమె సమావేశ మయ్యారు వ్యవసాయం సంబంధించి ఈ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

మండలంలో 30 మంది రైతులను ఎంపిక చేశామన్నారు. క్షేత్రస్థా యిలో వారు బేస్ లైన్ సర్వే చేసి పొలాల్లో సమస్యలను తెలుసుకుంటారన్నారు . కలవపాముల గురువారం కాటూరు ,కడవకల్లు శుక్రవారం ,ఆకునూరు ,ఉయ్యూరు గ్రామాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులతో కలిసి పొలంబడి నిర్వహిస్తారని మండల వ్యవసాయ అధికారి జి .వి .శివ ప్రసాద్ తెలిపారు.

Tags:    

Similar News