రాజధాని వ్యవహారంలో ఏర్పాటైన హై పవర్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ సీఆర్డీఏ ఆఫీస్లో భేటీ కానుంది. ఇప్పటికే జీఎన్రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలు సమర్పించింది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో పది మంది మంత్రులు, ఆరుగురు అధికారులున్నారు.