సహజంగా అయితే మనం ATMలో డబ్బులు రాకపోతే ఎం చేస్తాం... మరో ATM చూసుకుంటాం. అంతేకానీ డబ్బులు ఇవ్వలేదని ATMని పగలగోడతమా ? లేదుగా కానీ ఓ యువకుడు మాత్రం కార్డు పెట్టిన వెంటనే ATMలో నుండి డబ్బులు రాలేదని ఏకాంగా సిలిండర్ తీసుకువచ్చి మరీ ఏటీఎం మిషన్ను పగలగొట్టాడు... దీనితో ATM మిషిన్ లోని మిషన్ స్క్రీన్తో పాటు బ్యాటరీ, డబ్బులు వచ్చే మిషన్ అన్నీ పగిలి చిందరవందర అయ్యాయి.
తన కోపం తీరాకా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఘటన కడప జిల్లా మోచంపేట శివాలయం ఎదురుగా ఉన్న సిండికేట్ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో చోటు చేసుకుంది. దీనిపైన బ్యాంకు మేనేజర్ అయిన మంజుల పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు సుధీర్కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడప్పుడు సాంకేతిక లోపం కారణం చేత ATMలు పని చేయవని అంతమాత్రాన వాటిని ద్వంసం చేయడం సరికాదని బ్యాంకు అధికారులు చెప్పుకొచ్చారు.